యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్. సినిమాల విషయంలో స్పీడు పెంచారు. ఇటీవల నటించిన రణరంగం, పడి పడి లేచే మనసు, జాను వంటి చిత్రాలు ఆశించిన స్థాయి ఫలితాల్ని అందించకపోవడంతో కొంత ఆలోచనలో పడ్డ శర్వా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాల్ని లైన్లో పెట్టారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `శ్రీకారం`. ఈ చిత్రం ద్వారా కిషోర్ రెడ్డి. బి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతోంది. అల్మోస్ట్ చివరిదశకు చేరుకుంది. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు శర్వా మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో `మహా సముద్రం`తో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.
ఈ చిత్రానికి `ఆడాళ్లు మీకు జోహార్లు` అనే టైటిల్ని ఖరారు చేశారు. గతంలో ఈ చిత్రాన్ని వెంకటేష్, నిత్యమీనన్లతో చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పటికి అదే కథని శర్వాతో చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శర్వాకు జోడీగా ముందు సాయి పల్లవిని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ స్థానంలో విజయ్ దేరవకొండ హీరోయిన్ రష్మిక మందన్నని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్తో `పుష్ప`, కార్తిలో `సుల్తాన్` చిత్రాల్లో నటిస్తోంది. ఈ నెల 25న ఈ చిత్రం ప్రారంభం కానుంది.