నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ `రంగ్ దే`. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవరనాగవంశీ నిర్మించారు. గత శుక్రవారం వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అనూహ్యంగా ఆకట్టుకుంటోంది. కరోనా సెకండ్ వేవ్ వంటి అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మార్కును దాటిందని చెబుతున్నారు.
నిర్మాతల లెక్కల ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో `రంగ్ దే` 3 రోజుల్లో 10.35 కోట్లు వాసూలు చేసినట్టు తెలుస్తోంది. దేశం మొత్తం హోలీని జరుపుకుంటున్నందున సోమవారం కూడా సెలవుదినం కాబట్టి ఈ వారం విడుదలయ్యే అన్ని చిత్రాలలో బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచిన ఏకైక చిత్రంగా `రంగ్ దే` నిలవడం విశేషం.
`రంగ్ దే` ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల వారీగా వసూలు చేసిన వసూళ్ల వివరాలివి.
నైజాం: 3.79 కోట్లు
సీడెడ్ : 1.66 కోట్లు
వైజాగ్ 1.30 కోట్లు
గుంటూరు 1.09 కోట్లు
తూర్పు 0.85 లక్షలు
వెస్ట్ 0.57 లక్షలు
కృష్ణ 0.65 లక్షలు
నెల్లూరు 0.44 లక్షలు
ఏపీ, తెలంగాణ మొత్తం షేర్ 10.35 కోట్లు