![Rana sensational comments on lady journalist](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/03/Rana-sensational-comments-on-lady-journalist.jpg)
వరుస క్రేజీ ప్రాజెక్ట్లతో బిజీగా వున్న రానా తాజాగా ఓ మహిళా జర్నలిస్టుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఊహించుకునే ముందు దాని గురించి జాగ్రత్తగా తెలుసుకోడని, అంతే గానీ సంచలనం కోసం ఏది పడితే అది చెత్త రాయకండని, మీరు పనిచేస్తున్న పత్రికకు విలువుండని, దాన్ని పాడుచేయకండని హితవు పలికారు. `మీటూ ` సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న టాలెంట్ మేనేజ్మెంట్ క్వాన్ సహా వ్యవస్థాపకుడు అనిర్బన్ బ్లాతో డిన్నర్ చేశారని, ఆయన్ని ప్రత్యేకంగా కలిశారని ఓ పత్రిక ప్రచురించింది.
దీన్ని సీరియస్గా పరిగణించిన నెటిజన్స్ రానాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాదు. నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం` అని కామెంట్ చేశారు. ఈ కథనంపై సీరియస్ అయిన రానా పై విధంగా సోమవారం స్పందించారు. అనిర్బన్ బ్లా లాంటి వ్యక్తిని కూడా రానా సపోర్ట్ చేస్తారా? అని రానాని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన రానా సదరు జర్నలిస్టుపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తూనే సదరు మహిళా జర్నలిస్టుకు చురకలంటించారు.
నేను ఎక్కడ వున్నాను. ఏం చేస్తున్నాను. అని ఊహించుకోవడానికి ముందు నిజా నిజాలు తెలుసుకోండి. నా నంబర్ వుంటే ఫోన్ చేయండి. లేదంటే నా పీఆర్ టీమ్ని సంప్రదించండి. అంతే కానీ అడ్డమైన చెత్త రాయకండి. మీరు పనిచేస్తున్న పత్రికకు గౌరవం వుంది. నీ పట్ల సిగ్గుపడుతున్నా` అని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.