టాలీవుడ్ హీమాన్ రానా ప్రేమించిన మిహీకాను ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆగస్టు 8న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రామానాయుడు స్టూడియోస్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం హనీమూన్కి వెళ్లాలని ప్లాన్ చేసినా కోవిడ్ కారణంగా ఆ ప్రయత్నాలని విరమించుకున్నారట. త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక రానా జోడీ హనీమూన్ యాత్రకు వెళుతుందని ఇటీవల రానా వెల్లడించారు.
ఇదిలా వుంటే రానా వివాహానంతరం మళ్లీ సినిమాల విషయంలో స్పీడు పెంచారు. తాజాగా మరో బాలీవుడ్ చిత్రాన్ని అంగీకరించారు. దర్శకుడు మిలింద్ రావు చెప్పిన పాయింట్ నచ్చడంతో రకానా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సిద్ధార్ధ్తో `గృహం` చిత్రాన్ని రూపొందించి ప్రశంసలందుకున్న మిలింద్ రావు చెప్పిన థ్రిల్లింగ్ పాయింట్ నచ్చడంతో వెంటనే రానా ఓకే చెప్పినట్టు తెలిసింది.
అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ మూవీ సాగుతుందని, భారతీయ పురాతన విద్య చేతబడి ఆధారంగా ఈ మూవీ రూపొందనుందని తెలిసింది. వీఎఫ్ ఎక్స్కి ప్రాధాన్యం వున్న ఈ చిత్రాన్ని డి. సురేష్బాబుతో కలిసి అనిల్ సుంకర నిర్మాస్తారట.