విభిన్న కథా చిత్రాల హీరోగా బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానాకు మంచి పేరుంది. అతను నటించిన `అంధాధున్`. శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఆయుష్మాన్ ఖురానాకు అవార్డుని అందించింది. టాబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం దక్షిణాది భాషల్లో రీమేక్ అవుతోంది.
ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు.
ఆయుష్మాన్ పాత్రలో నితిన్ నటించనున్న ఈ చిత్రంలోని టాబు పాత్రలో శివగామి రమ్యకృష్ణ నటించనున్నట్లు తెలిసింది. ఇందులో ఆమె పాత్ర చాలా గ్లామర్గా వుంటుందని, మరో పాత్ర కోసం యాంకర్, నటి అనసూయను చిత్ర బృందం సంప్రదిస్తున్నట్టు చెబుతున్నారు. పాండిచ్చేరి నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని అక్కడే షూటింగ్ చేయబోతున్నారని తాజా టాక్.