కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి ప్రపంచం మొత్తం లాక్డౌన్ మోడ్లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రధాన వ్యవస్థలన్నీ బంద్ అయిపోయాయి. దీని కారణంగా చాలా మందికి పనిలేకుండా పోయింది. నిత్యం పని చేసుకుంటూ ఆ వచ్చిన మొత్తంతో కుటుంబాల్ని వెల్లదీసుకుంటున్న అసంఘటి కార్మికులంతా ప్రస్తుతం ఇబ్బందుల్లో వున్నారు. ముఖ్యంగా సినీ కార్మికుల్ని ఆదుకోవడం ప్రధాన ఉద్దేశ్యంగా చిరంజీవి అధ్యక్షతన సీసీసీ పేరుతో చారిటీని ఏర్పాటు చేశారు.
దీనికి స్టార్స్ చాలా మంది విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే దాదాపు 8 కోట్ల వరకు విరాళాలు అందాయి. తాజాగా సీసీసీకి ఈనాడు గ్రూప్ సంస్థల అథినేత రామోజీరావు 10 లక్షలు విరాళం అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ `సీసీసీకి రామోజీరావుగారి దగ్గరి నుంచి పది లక్షల రూపాయల ఆర్జీజీఎస్ అందిందని తెలిసిన తరువాత నేను ప్రత్యక్షంగా ఆయనకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలపడం జరిగింది. మీ లాంటి వాళ్లు మేము చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించడమే కాకుండా దాన్ని ప్రోత్సహిస్తూ పది లక్షల రూపాయలు ఇవ్వడం చాలా ఆనందంగా వుంది అన్నాను. దీనికి ఆయన చిరంజీవిగారు మీరు చేసే కార్యక్రమాలను, ఇంటింటికి సరఫరా చేసే విధానము గమనిస్తున్నాను. బాగా చేస్తున్నారు. అయినా నేను ఇచ్చింది చాలా చిన్న అమౌంట్ అన్నారు` అని తెలిపారు.
చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రామ్చరణ్, నిరంజన్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. కాగా తాజా షెడ్యూల్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.