ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఊహించనంత రేంజ్ లో సూపర్ హిట్ అయింది. నిజానికి రామ్ కూడా సక్సెస్ రావాలని కోరుకున్నాడే కానీ ఈ రేంజ్ సక్సెస్ ఊహించలేదు. ఒక్కోసారి మరీ ఈ రేంజ్ సక్సెస్ కూడా అయోమయంలో పడేస్తుంది. తర్వాత ఏ సినిమా చేయాలన్న డైలమాలో ఉంచుతుంది. ప్రస్తుతం రామ్ పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది.
ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత రామ్ కూడా ఇప్పుడు ఏ చిత్రం చేయాలా అన్న ఆలోచనలో పడిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ కు ముందే రామ్ తడం సినిమా రీమేక్ కు ఓకే చెప్పి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా చేయడం కరెక్టేనా అన్న సందేహంలో ఉన్నాడట. ఎందుకంటే మాస్ సినిమా చేసి హిట్ కొట్టాక, మరో మాస్ సినిమా చేస్తే బెటర్ ఏమో అన్న సందేహం రామ్ ను ఇన్నాళ్లూ వెంటాడింది.
చాలా రోజుల ఆలోచన తర్వాత రామ్ తడం సినిమా రీమేక్ కే కమిట్ అయినట్లు తెలుస్తోంది. తనతో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు తీసిన కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. నివేద పేతురాజ్ తో పాటు మాళవిక శర్మ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించనున్నారు. రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రారంభించి వచ్చే వేసవికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.