`ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎనర్జిటిక్ హీరో రామ్ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. `ఇస్మార్ట్…తో మాస్ని.. క్లాస్ని ఆకట్టుకున్న రామ్ మరో మాస్ థ్రిల్లర్తో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రామ్ నటించిన తాజా చిత్రం `రెడ్`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శనివారం సెన్సార్ పూర్తయింది. జనవరి 14న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ `ఈ రోజే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికెట్ లభించింది. దేవదాసు, మస్కా చిత్రాల తరువాత సంక్రాంతికి వస్తున్న సినిమా ఇది. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో వుంటాయి. `ఇస్మార్ట్ శంకర్`కు సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ని అందించిందిన మణిశర్మ`రెడ్` చిత్రానికి కూడా అంతే అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. థియేటర్లలో సినిమా విడుదల చేయాలనే సంకల్పంతో ప్రేక్షకులకు థియేట్రికల్ అనుభూతిని అందించాలనే అంతా ఇన్నాళ్లూ ఎదురుచూశాం` అన్నారు.
ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని, ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు. యూట్యూబ్లో నెంబర్ వన్గా ట్రెండింగ్ అవుతోందని, అన్ని థియేటర్లలోనూ ట్రైలర్కు విశేష స్పందన లభిస్తోందిని నిర్మాత స్రవంతి రవికిషోర్ పేర్కొన్నారు. ఇందులో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు.