ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ నుండి తన కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పాడు. ఇస్మార్ట్ శంకర్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రామ్ పోతినేని ఇకపై మాస్ చిత్రాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. అప్పటిదాకా కెరీర్ లో ఎక్కువగా రొమాంటిక్ ఎంటెర్టైనెర్స్ చేసాడు. ఆ కోవలోనే ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ చేసాడు. ఈ చిత్రం మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో తెలుగు – తమిళ బైలింగువల్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుండగా ఆది పినిశెట్టి విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
లింగుసామితో చిత్రం తర్వాత మరో సినిమాను ఫైనల్ చేయలేదు రామ్. తాజా సమాచారం ప్రకారం ఇకపై తెలుగు – తమిళ ద్విభాషా చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నాడు. ఇందుకోసం మరోసారి తమిళ దర్శకులకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.