టాలీవుడ్ లో ఒకప్పుడు రకుల్ క్రేజ్ వేరు. ఆమెకున్న డిమాండ్ వేరు. ఏ స్టార్ సినిమా చూసినా రకులే కనిపించింది. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాగార్జున, గోపీచంద్ .. ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,ప్రభాస్ మినహా ఇండస్ట్రీలో వున్నా టాప్ హీరోలందరితో కలిసి నటించింది.
ప్రస్తుతం కమల్ హాసన్ తో శంకర్ రూపొందిస్తున్న ‘ఇండియన్ 2’ , నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి రూపొందిస్తున్న చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలే కాకుండా హిందీలోనూ నటిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా వున్న రకుల్ కరోనా క్రైసిస్ కారణంగా తన పారితోషికాన్ని సగానికి తగ్గించుకోనుందని తెలిసింది
రకుల్ ప్రీత్ సింగ్ ఒక ప్రాజెక్ట్ కు కోటిన్నర వసూలు చేస్తోంది. తాజా నిర్ణయంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ లకు కేవలం అందులో సగం అంటే 75 లక్షలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకుందట. రకుల్ నిర్ణయంతో చాలా మంది నిర్మాతలు కూడా ఆర్టిస్ట్ లకు పారితోషికాలు భారీగా తగ్గించాలని నిర్ణయించుకున్నారట.
- Advertisement -