కరోనా మహమ్మారి చాపకింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఎక్కడ ఎవరికి సోకుతుందో అని జనం భయంతో వణికిపోతున్నారు. సెలబ్రిటీలు ప్రయాణాలు రద్దుచేసుకుంటుంటే, సినిమా షూటింగ్లని కూడా రద్దు చేస్తున్నారు. జనానికి కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ ఎలా వుండాలి?. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని సెలబ్రిటీలు సమాన్య జనానికి వెల్లడిస్తూ జాగ్రత్తలు చెబుతున్నారు. ఇదిలా వుంటే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది.
కమల్హాసన్ నటిస్తున్న `ఇండియన్ 2`, శివ కార్తికేయన్ నటిస్తున్న `అయలాన్` చిత్రంలో నటిస్తున్న రకుల్ తాజాగా `ఇండియన్ 2` సెట్లో చిత్ర బృందంతో కలిసి దిగిన ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకునే షూటింగ్లో పాల్గొంటున్నానని పోస్ట్ చేసిన రకుల్ తాజాగా మరో పోస్ట్ని పెట్టింది. ఇటీవల ఓ యాడ్ షూట్లో పాల్గొన్న రకుల్ తను నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్లు ఈ నెల 31 వరకు వాయిదా వేశారని వెల్లడించింది.
దీంతో తాను స్వీయ నిర్భంధంలోకి వెళుతున్నానని, షూటింగ్లకు దూరంగా వుంటున్నానని, మామూలుగా అయితే తాను రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా వుండాల్సిందని, కరోనా వైరస్ కారణంగా ఆ రెండు చిత్రాల షూటింగ్లు రద్దయ్యాయని స్పష్టం చేసింది. దీంతో ఈ ఖాళీ సమయాన్ని ఫిట్ నెస్ కోసం వినియోగిస్తోంది. ఇంట్లో వున్న ఫర్నీచర్తో వర్కవుట్లు చేయడం మొదలుపెట్టింది.
Credit: Instagram