ఈ రోజుల్లో నిజం కంటే ముందు జనం అబద్ధాలకే విలువిస్తున్నారు. దాంతో కన్నుమూసి తెరిచేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇందుకు అద్దంపడుతోంది. ఇటీవల ఏపీలో మద్యం షాపులు ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. జనం పూనకాలు వచ్చినట్టుగా మద్యం షాపుల ముందు మద్యం కోసం కిలోమీటర్లమేర బారులు తీరారు. ఇదే తరహాలో తెలంగాణలోనూ మద్యం దుకాణాలు తెరిచిన విషయం తెలిసిందే.
ఇదే తరహాలో దేశ వ్యాప్తంగా కొన్ని షరతులతో కూడిన వెసులుబాటును కేంద్రం కల్పించడంతో దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఎక్కడ చూసినా మందుబాబుల కోలాహళమే. తాజాగా ముంబై బాంద్రాలోని ఓ వీధిలో ఓ షాపులోంచి తనకు కావాల్సిన బాటిల్స్ తీసుకుని హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ రోడ్డుదాటుతున్న వీడియో వైరల్గా మారింది. హీరోయిన్ మద్యం బాటిళ్లు తీసుకుని వెళుతోందంటూ అసత్య ప్రచారం మొదలైంది.
అయితే ఆ వీడియోని పరిశీలించి చూస్తే ఆమె మెడికల్ షాప్ నుంచి తన వాళ్లకు కావాల్సిన మెడిసిన్స్, సిరప్ బాటిల్స్ తీసుకుని రోడ్డుదాటుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే కొంత మంది కావాలనే రకుల్ మధ్యం షాపు నుంచి మధ్యం కొనుగోలు చేసి తీసుకెళుతోందంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ తప్పుడు వార్తలపై కొంత మంది నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి వార్తల్ని వైరల్ చేసేటప్పుడు కాస్త పరిశీలించాలని, ఫా్యక్ట్ చెక్ చేసుకోవాలని మండిపడుతున్నారు.