కాలం కలిసి రానప్పుడు ఓడలు బల్లువుతాయి.. బల్లు ఓడలవుతాయంటారు. ఇది అక్షరాలా నిజమే. క్రేజ్ హిట్కి మాత్రమే విలువనిచ్చే సినిమా రంగంలో హిట్ వుంటేనే వాల్యూ… లేదంటే ఏ ఒక్కరూ పట్టించుకోరు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ఒక దశలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.
అయితే వరుసగా స్టార్ హీరో మహేష్తో చేసిన ల`స్పైడర్`, కార్తితో చేసిన `దేవ్`, సూర్యతో కలిసి నటించిన `ఎన్జీకే`, నాగార్జునతో ఓ స్టెప్ దిగి మరీ చేసిన `మన్మధుడు -2` ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా రకుల్ క్రేజ్ పడిపోయింది. దీంతో అనుకున్న స్థాయిలో అవకాశాల్ని సొంతం చేసుకోలేకపోయింది.
తమిళంలో శంకర్ తెరకెక్కిస్తున్న `భారతీయుడు 2` చిత్రంతో పాటు మరో రెండు హిందీ చిత్రాల్లో నటిస్తున్నా రకుల్ చేతిలో మాత్రం తెలుగులో ఒకే ఒక్క చిత్రం వుంది. అది నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి రూపొందిస్తున్న `చెక్`. ఈ సినిమాతో మళ్లీ రకుల్ తెలుగులో బైన్స్ బ్యాక్ కావాలని చూస్తోందట. అది ఎంత వరకు సఫలం అవుతుందన్నది ఈ సినిమా ఫలితాన్ని బట్టి తేలుతుందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి.