గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనకు తాజగా బాంబు బెదిరింపు కావడం తమిళ నాట కలకలంగా మారింది. ఓ అజ్ఞాత వ్యక్తి చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు ఫోన్ చేసి హీరో సూపర్స్టార్ రజనీకాంత్ నివాసంలో బంబు పెట్టామంటూ వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది.
వెంటనే తేరుకున్న చెన్నై పోలీసులు రజనీ నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించారు. హీరో రజనీకాంత్కు సెక్యురిటీని పెంచేశారు. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి వుంది. ఆకతాయిల ఫోన్ బెదిరింపు కాలా? లేక కావాలనే ఎవరైనా ఈ పని చేసి వుంటారా? అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న `అన్నాతే` చిత్రంలో నటిస్తున్నారు. శివ ఈ చిత్రాన్ని తెర కెక్కిస్తున్నారు. కీర్తిసురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా వైరస్ ప్రబలడంతో ఈ చిత్ర షూటింగ్ని నిరవదికంగా వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు ఏర్పడిన తరువాత ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.