Homeటాప్ స్టోరీస్పొంగ‌ల్‌కి సై అంటున్న త‌లైవ‌ర్‌!

పొంగ‌ల్‌కి సై అంటున్న త‌లైవ‌ర్‌!

పొంగ‌ల్‌కి సై అంటున్న త‌లైవ‌ర్‌!
పొంగ‌ల్‌కి సై అంటున్న త‌లైవ‌ర్‌!

క‌రోనా కార‌ణంగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీ స్థంభించిపోయింది. ఎక్క‌డా షూటింగ్‌లు లేవు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లేవు, థియేట‌ర్స్ బంద్‌.. కొత్త సినిమాల సంద‌డి లేదు. దీంతో చాలా మంది సినీ కార్మికులు ప‌నిలేకుండా ఖాలీగా కాలం వెల్ల‌దీస్తున్నారు. అయితే తాజాగా త‌మిళనాడు ప్ర‌భుత్వం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్కు అనుమ‌తులివ్వ‌డంతో త‌మిళ ఇండ‌స్ట్రీలో మ‌ళ్లీ హంగామా మొద‌లైంది.

ఈ నెల 11 నుంచే ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇవ్వ‌డంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ హ‌డావిడి మొద‌లైంది. దీంతో భారీ చిత్రాల హంగామా మ‌ళ్లీ మొద‌లైంది. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ కు అనుమ‌తులు ఇవ్వ‌డంతో ర‌జ‌నీ తాజా చిత్రాన్ని పొంగ‌ల్‌కి రిలీజ్ చేయ‌బోతున్నామంటూ చిత్ర బృందం ప్ర‌క‌టించింది.  `ద‌ర్బార్‌` త‌రువాత త‌మిళ సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న చిత్రం `అన్నాతే`. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మీనా, ఖుష్బూ సుంద‌ర్‌, న‌య‌న‌తార‌, కీర్తిసురేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- Advertisement -

స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామ‌ని స‌న్ పిక్చ‌ర్స్ మంగ‌ళ‌వారం అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఓ వీడియో ని రిలీజ్ చేసింది. లాక్‌డౌన్ త‌రువాత ఈ చిత్రానికి సంబంధించిన మ‌రింత స‌మాచారాన్ని ర‌జ‌నీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌నున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All