Homeటాప్ స్టోరీస్రాక్ష‌సులుగా మారిన స్టార్ హీరోల‌ ఫ్యాన్స్‌!

రాక్ష‌సులుగా మారిన స్టార్ హీరోల‌ ఫ్యాన్స్‌!

రాక్ష‌సులుగా మారిన స్టార్ హీరోల‌ ఫ్యాన్స్‌!
రాక్ష‌సులుగా మారిన స్టార్ హీరోల‌ ఫ్యాన్స్‌!

వెండితెర తార‌ల్ని అభిమానులు డెమీ  గాడ్స్ (దైవాంశ సంబూతులు)గా చూస్తుంటారు. వారి కోసం ఏం చేయ‌డానికైనా… ఎంత వ‌ర‌కు వెళ్ల‌డానికిఐనా వెనుకాడ‌రు. న‌చ్చితే పేప‌ర్ల‌నే పూలుగా చేసి వెండితెర‌పై పూల వ‌ర్షం కురిపిస్తుంటారు. అదే న‌చ్చ‌క‌పోతే తెర‌ల్ని చింపేసి భీభ‌త్సం సృష్టిస్తుంటారు. అప్పుడ‌ప్పుడు అభిమానం హ‌ద్దులు దాటుతూ ఆపండ్రా బాబూ మీ గోలా అని స్టార్స్ ప్రాధేయ‌ప‌డేలా చేస్తుంటారు.

కానీ అత్యంత రాక్ష‌సులుగా మాత్రం మారిన సంఘ‌ట‌న‌లు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. కానీ జ‌రిగింది. అదీ త‌మిళ‌నాడులో.. ద‌క్షిణాదిలో సినీ తార‌లంటే అభిమానం ఎక్కువే.. అభిమాన సంఘాలూ ఎక్కువే. హీరోలు ఫ్రెండ్స్‌లా వుంటున్నా.. వారి ఫ్యాన్స్ మాత్రం బ‌ద్ద శ‌త్రువుల్లా కొట్టుకుచ‌స్తుంటారు. త‌మిళ‌నాడులో స్టార్ హీరోలు ర‌జ‌నీకాంత్‌, విజ‌య్‌ల అభిమానుల మ‌ధ్య చిన్న గొడ‌వ హ‌త్య వ‌ర‌న‌కు వెళ్ల‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

- Advertisement -

క‌రోనా నివార‌ణ‌కు హీరోలిద్ద‌రూ విరాళం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇదే ఇద్ద‌రు అభిమానుల మ‌ధ్య చిచ్చు పెట్టింది. విజ‌య్ ఫ్యాన్ యువ‌రాజ్‌, ర‌జ‌నీ ఫ్యాన్ దినేష్ ఇద్ద‌రూ దీనిపై గొడ‌వ‌కు దిగారు. ఒకరిపై ఒక‌రు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ పెనుగులాట‌లో విజ‌య్ అభిమాని యువ‌రాజ్ కింద‌ప‌డిపోవ‌డంతో త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైంది. దీంతో యువ‌రాజ్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో దినేష్‌ని అరెస్టు చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All