Homeటాప్ స్టోరీస్మాహిష్మ‌తిలో వున్నా మాస్కు త‌ప్పనిస‌రి!

మాహిష్మ‌తిలో వున్నా మాస్కు త‌ప్పనిస‌రి!

మాహిష్మ‌తిలో వున్నా మాస్కు త‌ప్పనిస‌రి!
మాహిష్మ‌తిలో వున్నా మాస్కు త‌ప్పనిస‌రి!

ప్ర‌పంచ య‌వ‌నిక‌పై తెలుగు వారి కీర్తిని రెప రెప‌లాండించిన చిత్రం `బాహుబ‌లి`. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. భారీ వ‌సూళ్ల‌ని సాధించి 1000 కోట్ల క్ల‌బ్‌లో చేరిన తొలి తెలుగు చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది.

విజువ‌ల్ వండ‌ర్‌గా సంచ‌ల‌నం సృష్టించిన ఈ సినిమాలోని క్లైమాక్స్ స‌న్నివేశాన్ని ఓ విజువ‌ల్ ఎఫెక్ట్స్ సంస్థ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార్చింది. క్లైమాక్స్ స‌న్నివేశంలో మాహిష్మ‌తి సామ్రాజ్యంలో వున్న ప్ర‌భాస్, రానా మాస్కులు ధ‌రించి పోరాడుతున్న‌ట్లుగా వీడియోని మార్చింది. దీనికి సంబంధించిన వీడియోని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు. స‌ద‌రు సంస్థ‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన రాజ‌మౌళి `ప్ర‌తీ ఒక్క‌రూ భ‌ద్రంగా ఈ విధంగా నిబంధ‌న‌లు పాటిస్తార‌ని ఆశిస్తున్నా`న‌ని ట్వీట్ చేశారు.

- Advertisement -

మాహిష్మ‌తి సామ్రాజ్యంలో వున్న మాస్కు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌ర‌ని వీడియో ద్వారా సందేశాన్ని అందించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. క‌రోనా వైర‌స్ ప్ర‌మాద స్థాయిలో ప్ర‌బ‌లుతున్న వేళ `ఆర్ ఆర్ ఆర్‌` టెస్ట్ షూట్‌ని రాజ‌మౌళి క్యాన్సిల్ చేసిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All