రంగుల రాట్నం, లవర్, ఇద్దరి లోకం ఒకటే.. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో యంగ్ హీరో రాజ్ తరుణ్ సతమతమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `ఒరేజ్ బుజ్జిగా`. విజయ్ కుమార్ కొండ దర్శకుడు. కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 25న రిలీజ్కి సిద్ధమవుతోంది. కరోనా ప్రభావం తగ్గితే 25న రిలీజ్ వుంటుంది లేకపోతే వాయిదా పడే అవకాశం వుందని తెలిసింది.
ఈ సినిమా హిట్ దర్శకుడు విజయ్ కుమార్ కొండకు, హీరో రాజ్ తరుణ్కు చాలా అవసరం. అందుకు తగ్గట్టే ప్లాన్ ని పర్ఫెక్ట్గా చేసుకున్నారు. కరీంనగర్, తిరుపతి, హైదరాబాద్లలో ప్రీరిలీజ్ ఈ వెంట్లు చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్లో ప్రీరిలీజ్ ఈ వెంట్ని పూర్తి చేశారు. ఇదిలా వుంటే రాజ్ తరుణ్ గత కొంత కాలంగా తన సింగిల్ స్టేటస్పై వరుస కథనాలు వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ ఓ హీరోయిన్తో డేటింగ్లో వున్నాడని, త్వరలోనే ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు.
తను ఎవరితో డేటింగ్లో లేనని, తను సింగిల్ గానే వున్నానని అయితే మరో మూడేళ్ల తరువాత మాత్రం వివాహం చేసుకోబోతున్నానని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. రాజ్ తరుణ్ `ఒరేయ్ బుజ్జిగా` చిత్రం తరువాత జయచంద్ర పసలపూడి దర్శకత్వంలో `ఛాంపియన్` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.