కర్ణాటకలోని బెంగళూరులో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలిన చందంగా డ్రగ్స్ కేసుకి కన్నడ ఇండస్ట్రీలోని ఆరికి సంబంధాలున్నాయని బయటపడింది. అదే క్రమంలో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్లకు, కన్నడ హీరోయిన్లు రాగిణి దివ్వేది, సంజన గల్రానీలకు సంబంధాలు వున్నాయని, వీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని బెంగళూర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు.
ఆ తరువాత వీరిని బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకి రిమాండ్కి తరలించారు. అదే సమయంలో బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ కేసులో అనుమానితురాలిగా వున్న రియా చక్రవర్తికీ డ్రగ్స్ పెడ్లర్లతో సంబందాలు వున్నాయని నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెని అరెస్ట్ చేయడంతో రాగిణి దివ్వేది, సంజనల కేసు దేశ వ్యాప్తంగా సంలనంగా మారింది.
గత కొన్ని నెలలుగా బెయిల్ కోసం రాగిణి దివ్వేది, సంజన ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ఇటీవల రాగిణి కర్ణాటక హైకోర్టులో బెయిల్ కోసం పిటీషన్ వేసింది. బెయిల్ పిటీషన్ని కర్ణాటక హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించింది. సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాగిణి దివ్వేది ఊపిరి పీల్చుకుంది.