చందన సీమ కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో కన్నడ హాట్ హీరోయిన్ రాగిణి దివ్వేది బుక్కయ్యారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా వంటి పలు ఆరోపణల నేపథ్యంలో రాగిణిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల వినియోగం, రావాణా ఆరోపణలతో అరెస్ట్ అయిన నటి రాగిణి దివ్వేది. ఆమెని అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు హజరు పరిచారు.
ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. విచారణ అధికారులకు నటి రాగిణి ఏమాత్రం సహకరించడం లేదని చెబుతున్నారు. ఎంతగా ప్రశ్నించినా సరైన సమాధానాలు రావడం లేదని, మౌనంగా వుంటోందని చెబుతున్నారు. దీంతో అధికారులు తమ దర్యాప్తుకు సహకరించడం లేదని న్యాయమూర్తివి వివరించడం ఆసక్తికరంగా మారింది.
అంతే కాకుండా విచారణ సందర్భంగా రాగిణి దివ్వేది వింత చేష్టలు చేసినట్టు చెబుతున్నారు. తనకు వెన్ను నొప్పి వస్తోందని, ఇతర ఆరోగ్య సమస్యలు తనకు వున్నట్టు చెప్పడమే కాకుండా తనకు ఎలర్జీ వుందని చెప్పి షాకిచ్చిందట. న్యాయమూర్తి వెంటనే కలగజేసుకుని ఆమెకు తగిన వైద్యం చేయించాలని సీసీబీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారట. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాగిణికి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారట.