కన్నడ చిత్ర పరిశ్రమల డ్రగ్స్ కేసు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఇప్పటికీ చర్చనీయాంశంగానే నిలుస్తోంది. ఈ కేసులో కన్నడ నట రాగిణి దివ్వేది అరెస్ట్ కావడం తెలిసిందే. కొన్ని రోజుల పాటు బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో జ్యుడీషియల్ కష్టడీలో వున్న రాగిణి దివ్వేది ఇటీవలే బెయిల్పై విడుదలైంది.
ఈ సందర్భంగా అభిమానులతో ఇన్స్టా వేదికగా తన అనుభవాలని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా రాగిణి భావోద్వేగానికి గురైంది. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని క్లిష్టమైన సమయాలుంటాయని వాటిని ఎదుర్కొని నిల్చునప్పుడే మనం జీవితంలో ముందుకు వెళ్లగలమని చెప్పింది. `ప్రేమ, బాధ, ఆనందం.. ఇలా ఎన్నో భావోద్వేగాలతో 2021 ప్రారంభమైంది. కొన్ని నెలలుగా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొంటున్నాను. చాలా మంది నా గురించే మాట్లాడుకుంటున్నారు. పలువురు నన్నపు ఇబ్బందికరంగా తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఎవరు ఏమన్నా సరే ప్రతిదానికి కాలమే సమాధానం చెబుతుంది` అని తెలిపింది.
అయితే కొంత మంది నెటిజన్లు నా కుటుంబం గురించి కామెంట్లు పెడుతున్నారు. నేను వాళ్లకి చెప్పేది ఒక్కటే..మీరు చేసిన కామెంట్లని ఒక్కసారి మీరే చదవండి.. అలాంటి నెగెటివ్ కామెంట్లు, మానసిక కుంగుబాటు వల్ల సరిగ్గా నిద్రపోలేకపోతున్నా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా..` అని రాగిణి ఎమోషనల్ అయ్యింది.
View this post on Instagram