ఎమ్మెస్ ధోని బయోపిక్ లో నటించి అందరినీ మెప్పించి పలు అవార్డులను కూడా అందుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈరోజు షాకింగ్ గా బాంద్రాలోని తన స్వగృహంలో ఉరివేసుకుని చనిపోయినట్లుగా తెలుస్తోంది. సుశాంత్ సింగ్ వయసు కేవలం 34 సంవత్సరాలు. ఆత్మహత్యకు కల కారణాలు ఎంటనేవి ఇంకా తెలియలేదు. ఈ నెల 3న 2002లో మరణించిన తన తల్లి గురించి ఒక భావోద్వేగ పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు సుశాంత్ సింగ్.
బుల్లితెర నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కైపోచే చిత్రంతో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెస్ ధోని చిత్రంతో తన కెరీర్ లో పీక్స్ ను టచ్ చేసాడు. ఇటీవలే చచ్చోరె చిత్రంతో భారీ విజయాన్ని కూడా అందుకున్నాడు.
కెరీర్ లో మంచి ఫ్లో లో ఉన్న సమయంలోనే ఇలా జరగడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. దిల్ బేచార అనే సినిమాలో నటిస్తున్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఆ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.