తను చేసిన బొమ్మ పెద్ద తెరపై పడితే ఆ దర్శకుడు పడే ఆనందం వర్ణణాతీతం. అదీ తొలి సినిమా అయితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అదే సినిమా వెండితెరపై కాకుండా బుల్లితెరపై రిలీజ్ అయితే.. అది కూడా డిటిల్ ప్లాట్ ఫామ్ పై రిలీజ్ అయితే దర్శకుడు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని రాఘవ లారెన్స్ ఎదుర్కొంటున్నారు.
లారెన్స్ తొలిసారి బాలీవుడ్లో చేస్తున్న సినిమా `లక్ష్మీబాంబ్`. `కాంచన` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రారంభం నుంచి లారెన్స్కు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతూనే వుంది. తనకు చెప్పకుండా ఫస్ట్లుక్ని మేకర్స్ రిలీజ్ చేశారని ఫీలైన లారెన్స్ తను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించడం ఆ తరువాత అక్షయ్కుమార్ లైన్లోకి వచ్చి సర్దిచెప్పడం తెలిసింది.
ప్రస్తతం పరిస్థితులు కరోనా కారణంగా చేజారిపోవడంతో చిత్ర బృందం ఈ చిత్రాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ దిగ్గజంతో సంప్రదింపులు జరుపుతున్నారు. టాక్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తే సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది దర్శకుడు లారెన్స్కు బిగ్ బ్యాడ్ న్యూస్గా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. చేసిన తొలి సినిమానే థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ అవుతుండటం నిజంగా చేదు వార్తే.