యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. యూరప్ నేపథ్యంలో 80వ దశకం టైమ్ పీరియడ్లో సాగే కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వింటేజ్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ అంచనాలున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్ యువీ కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
ఇటలీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం వింటేజ్ ప్రేమకథగా ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ని తీసుకురానుందని తెలుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ఆడియన్స్ ఈ మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదరుచూపులకు తెరపడబోతోంది. ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ వింటేజ్ లవ్స్టోరీకి సంబంధించిన టీజర్ని చిత్ర బృందం రిలీజ్ చేయబోతోంది.
శుక్రవారం ఈ చిత్ర టీజర్ టైమ్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. వింటేజ్ బిల్డింగ్ పక్కనుంచి నడిచి వెళుతున్న ప్రభాస్ స్టిల్ ఆకట్టుకుంటోంది. సినిమా ఎలాంటి వాతావరణం.. ఎలాంటి కాలంలో సాగుతుందన్నది స్పష్టం చేస్తోంది. ఈ చిత్ర టీజర్ని ఈ నెల 14న ఉదయం 9:18 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు. `ప్రేమ పావురాలు` ఫేమ్ భాగ్యశ్రీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకు తెరతీయడం గ్యారెంటీ.
Love is in the air! ?
Get ready to get a glimpse of #RadheShyam on 14th Feb at 9.18 AM! ☺️ #14FebWithRSStarring #Prabhas & @hegdepooja pic.twitter.com/RfwH06WB92
— UV Creations (@UV_Creations) February 12, 2021