Homeటాప్ స్టోరీస్రేసుగుర్రం కాంబినేషన్ మళ్ళీ సెట్ అవుతోంది!

రేసుగుర్రం కాంబినేషన్ మళ్ళీ సెట్ అవుతోంది!

రేసుగుర్రం కాంబినేషన్ మళ్ళీ సెట్ అవుతోంది!
రేసుగుర్రం కాంబినేషన్ మళ్ళీ సెట్ అవుతోంది!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో జెన్యూన్ హిట్స్ లో రేసు గుర్రం కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీనికి సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా వక్కంతం వంశీ కథ అందించాడు. ఫిల్మ్ సర్కిల్స్ తాజా సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్ అవుతోంది. సైరా చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి పలువురు హీరోలతో సినిమాలను ప్రయత్నించాడు కానీ చివరికి బన్నీ వద్దకు వచ్చి ఆగాడు. ఈ ప్రాజెక్ట్ కు తమ మధ్య ఉన్న విభేదాలను సైతం పక్కన పెట్టి సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలిసి పనిచేయబోతున్నారు.

వక్కంతం వంశీ నిజానికి ఇప్పుడు దర్శకుడయ్యాడు. నా పేరు సూర్యతో ప్లాప్ వచ్చినా సరే దర్శకుడిగానే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజతో తన రెండో ప్రాజెక్ట్ ను సెట్ చేసుకున్నాడు. అయితే ఆ సినిమా పట్టాలెక్కడానికి మినిమం ఆరు నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం రవితేజ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వక్కంతం వంశీని సురేందర్ రెడ్డి అప్రోచ్ కావడంతో వంశీ కూడా కాదనలేకపోయాడు.

- Advertisement -

బన్నీ కోసం అన్ని కమర్షియల్ హంగులున్న కథను ఇద్దరూ కలిసి సెట్ చేస్తున్నారు. మాంచి కథతో, రేసీ స్క్రీన్ ప్లేతో ఉండేలా ప్రాజెక్ట్ ను బిల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ సినిమాను మొదలుపెట్టాల్సి ఉంది. లొకేషన్స్ విషయంలో అనుకోని సమస్య రావడంతో షూటింగ్ మొదలవ్వడానికి కొంత ఆలస్యమవుతోంది. అయితే ఒక్కసారి షూటింగ్ మొదలైతే వరస షెడ్యూల్స్ లో సినిమాను ఐదు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఈ లెక్కన బన్నీ – సురేందర్ రెడ్డి సినిమా ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వక్కంతం వంశీ – సురేందర్ రెడ్డికి కథ ఇచ్చేసి రవితేజతో తాను తీయబోయే సినిమా స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతాడన్నమాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All