“సాయి ధరమ్ తేజ్” తో జంటగా “రాశి ఖన్నా” గారు నటిస్తున్న సినిమా “ప్రతిరోజూ పండగే”, సినిమాకి “మారుతి దాసరి” గారు దర్శకత్వం చేస్తున్నారు. మరి ఈ రోజు ఒక సాంగ్ షూటింగ్ జరిగిందేమో? లేక ఇంపార్టెంట్ సీన్ ఏమైనా జరిగిందో? లొకేషన్లో హీరో-హీరోయిన్ ఇద్దరు ఫోటోకి ఫోజ్ ఇచ్చారు, ఆ ఫోటో ని రాశి ఖన్నా గారు పోస్ట్ చేశారు.
రాశి ఖన్నా ట్విట్టర్ లో.. “నాకు ఇష్టమైన వారిలో నా స్నేహితుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు అతనితో నా సినిమా ‘ ప్రతిరోజూ పండగే’ షూటింగ్ అందమైన ప్రదేశం అయిన రాజమండ్రి లో జరుగుతుంది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ” అని పోస్ట్స్ చేసారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే అల్లుఅరవింద్ గారి సమర్పణలో బన్నీవాస్ గారు ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘జిఏ 2 పిక్చర్స్’ వాళ్ళతో కలిపి సంయుక్తం గా భారీ అంచనాలతో నిర్మిస్తున్నారు. సంగీత దర్శకులుగా యువ సంచలనం థమన్.ఎస్ పాటలకి జీవం పోస్తున్నారు.
ఈ సినిమా తాత-మనువల్ల అనుబంధం చుట్టూ తిరుగుతుందని రీసెంట్ గా విడుదల చేసిన కొత్త పోస్టర్ ని చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమాని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, మొత్తానికి డిసెంబర్ లో డేట్ ఇంకా ఫిక్స్ గాని ఈ సినిమాకి కుటుంబ ప్రజలు కోరుకునే అంశాలు పుష్కలంగా ఉండొచ్చు అంటున్నారు సినీమా ప్రియులు. సాయి ధరమ్ తేజ్ – రాశి ఖన్నా మంచి పెయిర్ అని “సుప్రీమ్” సినిమా ద్వారా మనం చూసాం. ఈ సారి ఏ విధంగా మనలని అలరిస్తారో చూద్దాం.
Shooting with my buddy @IamSaiDharamTej ? in the beautiful Rajahmundry ❤️ for #PratiRojuPandaage pic.twitter.com/XQv3n32u3u
— Raashi Khanna (@RaashiKhanna) September 23, 2019
Credit: Twitter