టాలీవుడ్లో సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు పూరిజగన్నాథ్. అయితే ఒకానొక సందర్భంగాలో వరుస ఫ్లాపుల్లో వున్న పూరి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం చేసిన చిత్రం `బుడ్డా హోగా తేరా బాప్`. బిగ్బి అమితాబ్ బచ్చన్ నటించిన ఈ చిత్రం బాలీవుడ్లో సంచలన విజయం సాధించింది. రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
ఈ సినిమా తరువాత పూరిజగన్నాథ్ మరో హిందీ సినిమా చేయలేదు. `బిజినెస్మెన్`తో తెలుగులో మళ్లీ సక్సెస్ బాటపట్టారు. దాంతో బాలీవుడ్లో మళ్లీ ప్రయత్నాలు చేయలేదు. ఇన్నాళ్ల మళ్లీ బాలీవుడ్లో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా `ఫైటర్` చిత్రాన్ని చేస్తున్న పూరిజగన్నాథ్ ఈ సినిమాని పూర్తి చేసి వెంటనే బాలీవుడ్ లో ఓ హిందీ చిత్రం చేయాలనే ప్లాన్లో వున్నట్టు తెలిసింది.
ఇప్పటికే ఓ క్రేజీ హీరోకు కథ వినిపించారని, స్టోరీ చాలా అద్భుతంగా కుదిరిందని, ఈ తరహా కథ పూరి నుంచి ఇప్పటి వరకు రాలేదని, బాలీవుడ్ వర్గాలకు ఈ సినిమాతో పూరి మరోసారి షాక్ ఇవ్వడం ఖాయమని చార్మి చెప్పినట్టు వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని పూరిజగన్నాథ్ వెల్లడించే అవకాశం వున్నట్టు తెలిసింది.