Homeగాసిప్స్మ‌ళ్లీ `పైసా వ‌సూల్‌` కాంబినేష‌న్?

మ‌ళ్లీ `పైసా వ‌సూల్‌` కాంబినేష‌న్?

మ‌ళ్లీ `పైసా వ‌సూల్‌` కాంబినేష‌న్?
మ‌ళ్లీ `పైసా వ‌సూల్‌` కాంబినేష‌న్?

మ‌ళ్లీ `పైసా వ‌సూల్` కాంబినేష‌న్‌లో సినిమా రాబోతోందా? అంటే నిజ‌మే అంటున్నారు ఛార్మి. ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా లైవ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని నెటిజ‌న్స్‌తో చార్మి పంచుకున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తెర‌కెక్కిస్తున్న చిత్రంతో పాటు ఆకాష్ పూరితో నిర్మిస్తున్న `రొమాంటిక్‌` చిత్రాల విశేషషా‌ల్ని వెల్ల‌డించారు.

బాల‌కృష్ణ‌తో మ‌ళ్లీ పూరి జ‌గ‌న్నాథ్‌ క‌లిసి ప‌నిచేయ‌బోతున్నార‌ని క్లారిటీ ఇచ్చారు. ఇద్ద‌రి క‌ల‌యిక‌లో `పైసా వ‌సూల్‌` చిత్రం రూపొందిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి బాల‌య్య‌తో క‌లిసి కొత్త త‌ర‌హా సినిమా చేయాల‌ని పూరి ఆలోచిస్తున్నార‌ట‌. ఇందుకు త‌గ్గ క‌థ కోసం ఎదురుచూస్తున్నామ‌ని, వ‌న్స్ కథ కుదిరితే బాల‌య్య‌తో సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని, ఆయ‌న‌తో పూరికి మంచి అనుబంధం ఏర్ప‌డింద‌ని, దాన్ని కొన‌సాగిస్తూ మ‌రో సినిమా చేస్తామ‌ని చార్మి స్పష్టం చేశారు.

- Advertisement -

పూరి ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో గా తెర‌కెక్కుతున్న `ఫైట‌ర్‌` చిత్రం చేస్తున్నారు. కొంత భాగం ముంబైలో చిత్రీక‌ర‌ణ పూర్తయింది. హైద‌రాబాద్‌లో కీల‌క షెడ్యూల్ జ‌ర‌పాల‌నుకున్నారు. టీమ్ హైద‌రాబాద్ షిఫ్ట్ అయింది. షెడ్యూల్ స్టార్ట్ అనుకున్న స‌మ‌యంలో క‌రోనా విళ‌య తాండ‌వం సృష్టించ‌డంతో షూటింగ్‌ని వాయిదా వేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All