కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో మన వాళ్లు చాలా మంది చిక్కుకుపోయారు. లాక్డౌన్ విధించడంతో ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ సర్వీసుల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో చదువు కోసం, వ్యక్తిగత అవసరాల కోసం విదేశాలు వెళ్లిన వాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. ఇదే తరహాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ జోర్డాన్లో చిక్కుకుపోయారు.
బ్లేస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ `ఆడు జీవితం` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. కరోనా ప్రబలుతున్న వేళ పరిస్థితిని అంచనా వేయలేని పృథ్వీరాజ్ సుకుమారన్ తన 56 మంది టీమ్తో ఈ సినిమా చిత్రీకరణ కోసం జోర్డాన్ వెళ్లారు. కంత భాగం షూటింగ్ కూడా చేశారు. కరోనా ప్రబలడంతో దేశాలన్నీ అంతర్జాతీయ సర్వీసుల్ని రద్దు చేశాయి. దీంతో పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ టీమ్ జోర్డాన్లోనే స్ట్రక్కయిపోయారు.
అతని రాక కోసం అతని భార్య సుప్రియ మీనన్ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్గా మారింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ముద్దుల కూతురు అల్లి అతనిపై బెంగ పెట్టకుందట. ప్రతీ రోజు నాన్న ఎప్పుడొస్తాడని తల్ల సుప్రియని అడుగుతోందట. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది సుప్రియ. `లాక్డౌన్ ఎప్పుడు అయిపోతుంది అమ్మా..ఈ రోజైనా నాన్న వస్తారా? అని తన కూతురు అడుగుతోందని, మేమిద్దరం ఆయన కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Credit: Instagram