Homeటాప్ స్టోరీస్ఇండియాలోనే మొట్ట‌మొద‌టి వ‌ర్చువ‌ల్ ఫిల్మ్‌!

ఇండియాలోనే మొట్ట‌మొద‌టి వ‌ర్చువ‌ల్ ఫిల్మ్‌!

ఇండియాలోనే మొట్ట‌మొద‌టి వ‌ర్చువ‌ల్ ఫిల్మ్‌!
ఇండియాలోనే మొట్ట‌మొద‌టి వ‌ర్చువ‌ల్ ఫిల్మ్‌!

ఇండియాలోనే మొట్ట‌మొద‌టి వ‌ర్చువ‌ల్ ఫిల్మ్ మ‌ల‌యాళంలో తెర‌కెక్కుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో మ‌ల‌యాళ క్రేజీ హీరో పృథ్విరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. గోకుల్ రాజ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ని ఖ‌రారు చేయ‌లేదు. వ‌రుస విజ‌యాల‌తో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టిస్తున్న పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నార‌ట. మ‌ల‌యాళ‌, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం రూపొంద‌నున్న‌ట్టు తెలిసింది.

ఈ విష‌యాన్ని హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ని షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అ ఫిల్మ్ మేకింగ్‌లో ఇదొక గొప్ప క‌ళ‌. సాంకేతికంగా ఇదొక ఉత్తేజాన్నిచ్చే స‌రికొత్త అధ్యాయం. ఇందు కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తూ వుండండి. మారుతున్న కాలాలు కొత్త కొత్త స‌వాళ్లు వినూత్న ప‌ద్ద‌తుల‌ను అనుస‌రించి ఒక గొప్ప పురాణ క‌థ‌ను గొప్ప‌గా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తూ వుండండి` అని పృథ్వీరాజ్ సుకుమార‌న్ ట్వీట్ చేశారు.

- Advertisement -

పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించిన లూసీఫ‌ర్‌, అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రాలు తెలుగులో రీమేక్ కానున్న విష‌యం తెలిసిందే. `లూసీఫ‌ర్` చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయాల‌నుకున్నారు. ఇక `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` చిత్రాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేయ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All