ఓ పక్క కరోనా ప్రపంచాన్ని ఫుట్ బాల్ ఆడేస్తుంటే 58 మందితో ఎవరు చేయలేనరి లైఫ్ రిస్క్కి సిద్దమయ్యాడో హీరో.. అది కూడా పరాయి దేశంలో.. మండే ఏడారిలో.. టైమ్ కలిసి రాకపోవడంతో గత యాభై రోజులకు పైగా పరాయిదేశంలో తన టీమ్తో ఇరుక్కుపోయాడు. ముందుకు వెనక నుయ్యి ముందు గొయ్యి అన్నచందంగా తయారైంది పరిస్థితి. అయినా విపత్కర పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకుని వచ్చిన పని పూర్తి చేసుకున్నాడు.. మొత్తానికి తన పంతం నెగ్గించుకున్నాడు.
ఆ హీరో మరెవరో కాదు మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తున్న చిత్రం `ఆడు జీవితం`. బ్లెస్సీ దర్శకుడు. ఈ చిత్ర కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం 58 మంది టీమ్తో పృథ్విరాజ్ సుకుమారన్ జోర్డాన్ వెల్లడు. కరోనా ప్రబలడంతో టీమ్ అంతా అక్కడే స్ట్రక్ అయిపోవాల్సి వచ్చింది. వెంట ఆక్టర్స్ టీమ్ వుండటం, విడి విడిగా 58 మందికి షేల్టర్స్ నిర్మించడంతో ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. మొత్తానికి షూటింగ్ని పూర్తి చేశారు.
ఈ విషయాన్ని స్వయంగా హీరో పృథ్విరాజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ టీమ్తో కలిసి వున్న ఓ ఫొటోని షేర్ చేశాడు. ఈ నెల 15న చిత్ర బృందం మూవీ మేనేజర్ బర్త్డేని సెలబ్రేట్ చేసింది. ఈ ఫంక్షన్లో టీమ్ అంతా పాల్గొంది. టీమ్ త్వరలోనే కేరళకు పయనం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సర్వీసుల్ని మిషన్ భారత్ పేరుతో ప్రారంభించడంతో `ఆడుకాలం` టీమ్ త్వరలోనే కేరళ రాబోతోంది.
#Aadujeevitham Schedule pack up! ?❤️ pic.twitter.com/OrZjjf4yF5
— Prithviraj Sukumaran (@PrithviOfficial) May 17, 2020