నందమూరి బాలకృష్ణ .. ఊర మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో ఇప్పటి వరకు సింహా` లెజెండ్ వంటి హిట్ చిత్రాలొచ్చాయి. ఈ మూవీస్ తరువాత వీరిద్దరి కలయికలో ముచ్చటగా మూడవ చిత్రం రానున్న విషయం తెలిసిందే. మిర్యాల నవీందర్రెడ్డి అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెరీర్ లో తొలిసారి గుండుతో బాలయ్య అఘోరాగా కనిపించబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ లాక్డౌన్ బిఫోర్ పూర్తయింది. ఓ ఛేజింగ్ సీన్ని కూడా చిత్రీకరించారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ పరిస్థితులు ఎలా వుంటాయో తెలియడం లేదు. బాలయ్య అరవై దాటడంతో రిస్క్ ఎందుకని భావిస్తున్నారట. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిన తరువాత షూట్కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇదిలా వుంటే ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ఇంత వరకు ఏ హీరోయిన్ని ఫైనల్ చేయలేదు. తాజాగా మలయాళ బ్యూటీ ప్రగ్యా మార్టీన్ పేరు వినిపిస్తోంది. బీబీ3 గా ఇప్పటికే వైరస్ గా మారిన ఈ మూవీ కోసం ప్రగ్యా మార్టీన్ అయితేనే బాగుంటుందని బోయపాటి భావించి ఆమెని సంప్రదించినట్టు తెలిసింది. తమిళ హిట్ చిత్రం `పిశాచి`తో ప్రగ్యా మార్టీన్ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆ మూవీ తెలుగులో నూ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా మార్టీన్ని ఫైనల్ చేయాలని భావిస్తున్నారట.