కేజిఎఫ్ తో ఇండియన్ సినిమాను తనవైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. యాక్షన్ పరంగా కేజిఎఫ్ చాప్టర్ 1 సరికొత్త స్థాయిలో నిలిచింది. ఇప్పటికే కేజిఎఫ్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కేజిఎఫ్ చాప్టర్ 2 జులైలో విడుదల కావాల్సి ఉంది కానీ ప్రస్తుతం అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
కేజిఎఫ్ 2 విడుదల కంటే ముందే ప్రభాస్ తో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. సలార్ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ నిలిచిపోయింది.
సలార్ తర్వాత నీల్ చేయబోయే చిత్రంపై కూడా క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ తో నీల్ ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించనుంది. దీని షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. ఇక ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ హయ్యస్ట్ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నాడట. కేజిఎఫ్, సలార్ లకంటే ఎన్టీఆర్ చిత్రం కోసమే ప్రశాంత్ నీల్ కు ఎక్కువ ముడుతోందిట.