ప్రగ్యాజైస్వాల్కు బంపర్ ఆఫర్ లభించింది. గత కొంత కాలంగా సినిమా ఆఫర్లు లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా హాట్ ఫొటో షూట్లతో కాలక్షేపం చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. వరుస ఫొటో షూట్లతో సోషల్ మీడియాని హీటెక్కిస్తున్న ఆమెకు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన నందమూరి బాలకృష్ణతో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ రోర్ ఇప్పటికే విడుదలై సినిమాపై భారీ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. బాలయ్య ఓ పాత్రలో అఘోరాగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ మూవీలో బాలకృష్ణకు జోడీగా ఇద్దరు మలయాళ హీరోయిన్లని బోయపాటి సెలెక్ట్ చేశారు. ఒకరు ప్రయాగ మార్టీన్, మరొకరు పూర్ణ.
ఈ ఇద్దరిలో ప్రయాగా మార్టిన్ని వన్డే షూట్ చూసిన తరువాత ఆమెని తప్పించిన బోయపాటి శ్రీను ఆ స్థానంలో ప్రగ్యా జైస్వాల్ ని ఫైనల్ చేసినట్టు తెలిసింది. లాక్డౌన్ బిఫోర్ వారణాసిలో ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాల్ని చిత్రీకరించారు. త్వరలో ప్రగ్యాజైస్వాల్, బాలకృష్ణలపై తాజా షెడ్యూల్ని ప్రారంభించబోతున్నారట.