Homeటాప్ స్టోరీస్ఉగాది రోజున ప్రభాస్ అభిమానులకు డబల్ గిఫ్ట్ ఖాయమేనా?

ఉగాది రోజున ప్రభాస్ అభిమానులకు డబల్ గిఫ్ట్ ఖాయమేనా?

ఉగాది రోజున ప్రభాస్ అభిమానులకు డబల్ గిఫ్ట్ ఖాయమేనా?
ఉగాది రోజున ప్రభాస్ అభిమానులకు డబల్ గిఫ్ట్ ఖాయమేనా?

రెబెల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు ఉగాది రోజున ట్రీట్ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఫిల్మ్ సర్కిల్స్ లో. అది కూడా డబల్ ధమాకా అంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.  ఇప్పటివరకూ ఈ చిత్రానికి ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ వంటివేవీ జరగలేదు. తెలుగువారి కొత్త సంవత్సరాది రోజున ఈ విశేషాలు పంచుకోవాలని టీమ్ డిసైడ్ అయినట్లు సమాచారం.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న యూరోప్ లో ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ వైరస్ తాకిడి ఎక్కువ ఉన్నా సరే ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ షెడ్యూల్స్ అన్నీ తారుమారు అవుతాయన్న నేపథ్యంలో షూట్ ను జాగ్రత్తల మధ్య నడుపుతున్నారు. ప్రస్తుతం జార్జియాలో టీమ్ ఉంది. రీసెంట్ గా ఒక క్యూట్ ఛేజ్ సీక్వెన్స్ ను షూట్ చేశామని టిమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

అయితే జార్జియా వెళ్లకముందే ఈ చిత్ర టీమ్ ప్రభాస్ మరియు కథానాయిక పూజా హెగ్డేల మధ్య ఫోటోషూట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. వారి మధ్య నాలుగు భిన్నమైన కాస్ట్యూమ్స్ లో ఈ ఫోటోషూట్ జరిగిందట. ఇందులోంచి టీమ్ రెండు ఫోటోలను సెలక్ట్ చేసినట్లు సమాచారం. అందులో ఒకటి ట్రైన్ లో హీరో, హీరోయిన్ కూర్చున్నది కాగా మరొకటి ఇద్దరూ దగ్గరగా నిలబడి గిటార్ వాయిస్తున్న పిక్చర్ మరొకటని తేలింది. మరి వీటిలో నిజమెంత ఉందో తెలియదు కానీ ఉగాది మాత్రం రెండు పోస్టర్స్ రానున్నట్లు బలంగా వినిపిస్తోంది. దీంతో పాటు చిత్ర టైటిల్ ను కూడా ఆరోజే అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ చిత్రానికి రాధే శ్యామ్ లేదా ఓ డియర్ లలో ఏదో ఒక టైటిల్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఉగాది రోజున ప్రభాస్ అభిమానులకు నిజంగా పండగలానే ఉండబోతోంది. మరి ఈ డబల్ ట్రీట్ ను వారు ఎలా స్వాగతిస్తారో వేచి చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All