Homeటాప్ స్టోరీస్ప్రభాస్ సినిమాపై అప్డేట్ వచ్చేసిందోచ్

ప్రభాస్ సినిమాపై అప్డేట్ వచ్చేసిందోచ్

ప్రభాస్ సినిమాపై అప్డేట్ వచ్చేసిందోచ్
ప్రభాస్ సినిమాపై అప్డేట్ వచ్చేసిందోచ్

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమాలు చేయడం అభిమానులకు సంతోషాన్నిచ్చేదే కానీ దాని వల్ల వారు ఇబ్బంది పడుతున్న మాట కూడా వాస్తవమే. ప్యాన్ ఇండియా సినిమా అంటే షూటింగ్ నెలల తరబడి చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్స్ కూడా అనుకున్న ప్రకారం జరగవు. కొన్ని వాయిదాలు తప్పనిసరి. చాలా రోజుల పాటు ఎలాంటి అప్డేట్ ఉండకపోతే అభిమానులకు కంగారు మొదలవుతుంది. షూటింగ్ ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆరాటం ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌస్ ను ఎంత కదిపినా ఎలాంటి అప్డేట్ రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది?

సాహో విషయంలో ప్రభాస్ అభిమానులు తీవ్రంగా ఈ విషయమ్మీదే ఇబ్బంది పడ్డారు. ఎంతకూ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో యూవీ క్రియేషన్స్ ను దారుణంగా ట్రోల్స్ కూడా చేసారు. అయితే ఈసారి అలాంటి ఇబ్బంది రాకూడదని అనుకుంటోంది ఆ ప్రొడక్షన్ హౌస్. అందుకే ఎప్పటికప్పుడు షూటింగ్ గురించి లీకులు ఇవ్వడం, కొన్ని అధికారికంగా ప్రకటించడం చేస్తూ వస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రానికి కూడా యూవీ క్రియేషన్స్ ఒక నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.

- Advertisement -

ఈ చిత్ర తాజా షెడ్యూల్ ఇటీవలే యూరోప్ లోని జార్జియాలో మొదలైన సంగతి తెల్సిందే. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్నా కూడా ఈ చిత్ర యూనిట్ బెదరకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ను కానిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఒక క్యూట్ ఛేజ్ సీక్వెన్స్ ను షూట్ చేశారట. ఆ ఛేజ్ ప్రభాస్ హీరోయిన్ కోసం చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ సీక్వెన్స్ ను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారంతో చిత్రీకరించినట్లు, షూటింగ్ బాగా వస్తోందని ప్రొడక్షన్ హౌస్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి అప్డేట్స్ ఇస్తే ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతారు మరి.

అన్నట్లు ఈ యూరోప్ షూటింగ్ మరికొంత కాలం జరగనుంది. ఈ భారీ షెడ్యూల్ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All