టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోలు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ యమ బి.ఈగా గడిపేస్తున్న విషయం తెలిసిందే. అంగీకరించిన ప్రాజెక్ట్లన్నీ పూర్తియిన తరువాత కొంత సమయం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇదే తరహాలో టాలీవుడ్ `బాహుబలి` ప్రభాస్ కూడా బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్న వియం తెలిసిందే. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ తరువాత వెంటనే `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్న `సలార్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ శుక్రవారం లాంఛనంగా హైదరాబాద్లో ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించబోతున్నారు.
ఈ మూవీతో పాటు ఓం రౌత్ రూపొందించబోతున్న త్రీడీ చిత్రం `ఆదిపురుష్` చేయబోతున్నారు. టి సిరీస్ బ్యానర్పై అత్యంత భారీ బడ్జెట్తో ఈ మూవీ రూపొందబోతోంది. దీని తరువాత నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి తీసుకురానున్న సైన్స్ ఫిక్షన్ రూపొందనుంది. ఇలా వరుస ప్రాజెక్టలని ప్రకటించిన ప్రభాస్ వీటి తరువాత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారట. అయితే ఈ వార్త ప్రభాస్ అభిమానులందరికీ కొంత రుచించకపోయినా భరించక తప్పదని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.