![ప్రభాస్ మరో షాకివ్వబోతున్నాడా? ప్రభాస్ మరో షాకివ్వబోతున్నాడా?](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/08/Prabhas-ready-to-act-aditya-chopras-film.jpg)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి షాకివ్వడానికి సిద్ధమవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత మంగళవారం భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ `ఆది పురుష్` చిత్రాన్ని ప్రకటించి షాకిచ్చిన ప్రభాస్ త్వరలో అలాంటి షాక్నే ఇవ్వబోతున్నారట. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇదిలా వుండగానే ప్రభాస్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని ప్రకటించారు.
ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ఓం రౌత్దర్శకత్వంలో టిసిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రామాయణ గాధ నేపథ్యంలో రూపొందించనున్న `ఆది పురుష్` చిత్రాన్ని ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. 2022లో విడుదల కానుంది. ఇదిలా వుండగా తాజాగా ప్రభాస్ మరో క్రేజీ బాలీవుడ్ దర్శకనిర్మాతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది.
బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ప్రభాస్తో భారీ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ధూమ్ సిరీస్ లో భాగంగా ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం హృతిక్ రోషన్ని అనుకున్న ఆదిత్య చోప్రా ఆ స్థానంలో ప్రభాస్ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. `రాధేశ్యామ్` పూర్తి కాకుండా ప్రభాస్ మరో ప్రాజెక్ట్ని అంగీకరిస్తాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.