Homeటాప్ స్టోరీస్ఇట‌లీకి ప‌య‌న‌మైన ప్ర‌భాస్‌‌!

ఇట‌లీకి ప‌య‌న‌మైన ప్ర‌భాస్‌‌!

ఇట‌లీకి ప‌య‌న‌మైన ప్ర‌భాస్‌‌!
ఇట‌లీకి ప‌య‌న‌మైన ప్ర‌భాస్‌‌!

ప్ర‌భాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ‌కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పిరియాడిక్ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో టిసిరీస్‌తో క‌లిసి యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. గ‌త ఏడు నెల‌లుగా క‌రోనా వైర‌స్ కార‌ణంగా అన్ని సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే.

అదే విధంగా `రాధేశ్యామ్‌` షూటింగ్ కూడా లాక్డౌన్ కార‌ణంగా నిలిచిపోయింది. ఇటీవ‌ల అన్ని సినిమాల షూటింగ్‌లు తిరిగి ప్రారంభం అవుతుండ‌టంలో `రాధేశ్యామ్‌` షూటింగ్ ని మొద‌లుపెడుతున్నారు. లాక్‌డౌన్ బిఫోర్ ఈ మూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్లింది ఈ చిత్ర బృందం. అక్క‌డి మార్కెట్ నేప‌థ్యంలో ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు. కానీ మ‌రి కొంత భాగం షూట్ చేయ‌కుండానే టీమ్ క‌రోనా ప్ర‌బ‌లుతుండ‌టంతో తిరిగి ఇండియా వచ్చేసింది.

- Advertisement -

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ అన్ లాక్ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో తిరిగి అన్న రీఓపెన్ అవుతున్నాయి. ఈ నేప‌థ్ంలో చిత్ర బృందం గురువారం బ్యాలెన్స్ షూటింగ్‌ని పూర్తి చేయ‌డానికి ఇటలీ బ‌య‌లుదేరి వెళ్లిపోయింది. ఇందు కోసం ఏయిర్ పోర్ట్‌కి వ‌చ్చిన ప్ర‌భాస్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి. కీల‌క ఘ‌ట్టాల్ని పూర్తి చేసి టీమ్ తిరిగి ఇండియా రానుంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All