యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎవ్వరూ ఊహించిని విధంగా అడుగులు వేస్తున్నారు. వరుసగా పానన్ ఇండియా స్థాయికి మించి చిత్రాలని అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం `రాథేశ్యామ్` చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువీ బ్యానర్లో వస్తున్న అత్యంత భారీ చిత్రమిది. టీసిరీస్ వర్గాలు కూడా ఈ చిత్రానికి సహ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్, ట్రైలర్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. అక్టోబర్ నుంచి మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని దర్శకుడు రాధాకృష్ఱకుమార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ప్రభాస్తో కలిసి పనిచేయడం తన డ్రీమ్ అని, వచ్చే ఏడాది థియేటర్లో ఖచ్చితంగా కలుద్దామని, ప్రభాస్ లుక్ ఈ చిత్రానికి బిగ్గెస్ట్ అస్సెట్ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం హీరోయిన్గా పూజా హెగ్డేనే ఫస్ట్ ఛాయిస్ అన్నారు. ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్నీ వస్తాయి. ఫ్యాన్స్ అంతా ఓపికగా వుండండి. రైట్ టైమ్లో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాం` అని కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.