Homeటాప్ స్టోరీస్సింహంతో పెట్టుకున్నావ్.. సినిమా చూపిస్తాం!

సింహంతో పెట్టుకున్నావ్.. సినిమా చూపిస్తాం!

సింహంతో పెట్టుకున్నావ్.. సినిమా చూపిస్తాం!
సింహంతో పెట్టుకున్నావ్.. సినిమా చూపిస్తాం!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ `ప‌వ‌ర్‌స్టార్‌` పేరుతో ఎన్నిక‌ల త‌రువాత జ‌రిగిన క‌థ అంటూ ఓ సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. గ‌డ్డి తింటావా అంటూ ఓ పాట‌ని వ‌దిలిన వ‌ర్మ ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌రువు తీశార‌ని, డిజ్ లైకులు ఇంతేనా అని ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్ట‌డం మొద‌లుపెట్టాడు. ఇది ప‌వ‌న్ సినిమా కాదంటూనే ప‌వ‌న్ సినిమా తీస్తూ రెచ్చ‌గొడ్డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు.

వ‌ర్మ ని ఏకి పారేస్తూ `ప‌రాన్న జీవి` అనే పేరుతో సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. `రెక్లెస్ జెనెటిక్ వైర‌స్` అని ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.  వ‌ర్మ ఏ ఓటీటీ కోసం ఈ సినిమాని చేస్తున్నాడో అదే ఓటీటీలో `ప‌రాన్న జీవి`ని రిలీజ్ చేస్తున్నామంటూ ప్ర‌క‌టించారు. సోమ‌వారం మ‌రో పోస్ట‌ర్‌ని వ‌దిలిన ఫ్యాన్స్ దీని ద్వా‌రా వ‌ర్మ‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. `మాది దాడి కాదు.. ప్ర‌తి దాడి..వ్యూహం కాదు ప్ర‌తి ప్యూహం.. బ‌క‌రాల‌తో ఆడుకుంటే నీకు బిర్యానీ దొర‌కొచ్చు…సింహంతో పెట్టుకున్నావ్ సినిమా చూపిస్తాం..అంటూ వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

వ‌ర్మ ప‌వ‌న్‌పై తీస్తున్న `ప‌వ‌ర్‌స్టార్` ఈ నెల 25న ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో రిలీజ్ కాబోతోంది. 150 రూపాయ‌లు చెల్లించి 30 నిమిషాల నిడివిగ‌ల ఈ మినీ చిత్రాన్ని చూడ‌మంటున్నాడు వ‌ర్మ‌. వ‌ర్మ చేస్తున్న ప‌ని వల్ల ప‌వ‌న్ ఫ్యాన్స్ గ‌త కొన్ని రోజులుగా అస‌హ‌నంతో వున్నారు. ఈ నెల 25న `ప‌రాన్న‌జీవి`ని ఉద‌యం 11 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All