శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ `చుట్టాలబ్బాయి`. ఆది, నమితా ప్రమోద్ హీరో హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలకపాత్రలో నటించారు. వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు. మంచి కుటంబ కథా చిత్రంగా సినిమా మంచి ఆదరణ పొందిన ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీ చేజిక్కుంచుకుంది. మంచి ప్రొడక్షన్ వేల్యూస్తో తెరకెక్కించిన ఈ సినిమా పృథ్వీ, అలీ, అభిమన్యుసింగ్, యామినీ మల్హోత్రా, సురేఖావాణి తదితరులు నటించారు. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
యంగ్ హీరోతో కొత్త సినిమా…
శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్పై నిర్మాత వెంకట్ తలారి త్వరలోనే ఓ యువ కథానాయకుడితో సినిమా చేయడానిక సన్నాహాలు చేస్తున్నారు. వాటి వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.