Homeటాప్ స్టోరీస్చచ్చిపోతానంటే ఎగతాళి చేశాడు!

చచ్చిపోతానంటే ఎగతాళి చేశాడు!

చచ్చిపోతానంటే ఎగతాళి చేశాడు!
చచ్చిపోతానంటే ఎగతాళి చేశాడు!

హీరోయిన్ పూనమ్ కౌర్ టాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. గత కొన్ని రోజులుగా తాను మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని వెల్లడించిన పూనమ్ తనతో మాట్లాడాలని, తనకు చనిపోవాలనుందని ఓ దర్శకుడికి చెప్పిందట.

పూనమ్ మాటలు విన్న సదరు దర్శకుడు నువ్వు చనిపోతే ఒక్కరోజు న్యూస్ అవుతావని ఎగతాళి చేసాడని, ఆయన మాటలు విరక్తి కలిగించాయని సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కరంగా మారింది. ” ఆ దర్శకుడు ఎన్నో రంగాల్ని కంట్రోల్ చేస్తున్నాడని, పరోక్షంగా ఆర్టికల్స్ ద్వారా ఆయన తనతో మాట్లాడిన తీరు ఇంకా బాధించిందని మీడియా రాసిన అనవసరమైన వార్తలు నాలోని ఆత్మ విస్వాసాన్ని దెబ్బతీశాయని వెల్లడించింది పూనమ్.
నన్ను సినిమాల నుంచి నిషేధించావ్ ఫర్వాలేదు నువ్వు గురూజీవి కాదు. స్వలాభం కోసం నీ స్నేహితుల్ని కూడా మభ్యపెడుతున్నావు. నీవల్ల లాభం పొందిన వాళ్ళు నాకు తెలిసి ఎవరూలేరు. నీ అసలు రంగు చూసి షాకయ్యా  అని పూనమ్ సంచలన వ్యాఖ్యలు చేసేయడం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All