స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన తాజాగా నటిస్తున్న పూజా హెగ్డే నటన మాత్రమే కాదు సింగర్ గా కూడా రాణించాలని తహతహలాడుతోంది . తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ముచ్చటగా మూడో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది . ఇక ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు .
దాంతో తమన్ సంగీతం లో ఈ భామ కూని రాగాలు తీయడానికి గొంతు సవరించుకుంటోంది . పూజా హెగ్డే కు పాటలు పాడటం అంటే చాలా ఇష్టమట దాంతో ఈ చిత్రంలో ఓ పాట పాడాలని ఉందని తమన్ చెవిలో వేసిందట ! ఇంకేముంది తమన్ పూజా హెగ్డే ని సింగర్ గా మార్చడానికి తగు సలహాలు సూచనలు ఇస్తున్నాడట . దాంతో ఈ సినిమాలో ఓ పాట పాడటం ఖాయమని తెలుస్తోంది .
- Advertisement -