బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నఫిక్షనల్ పిరియాడిక్ రొమాంటిక్ లవ్స్టోరీ `రాధేశ్యామ్`. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని టి సిరీస్తో కలిసి యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రొమాంటిక్ ఫిక్షనల్ పిరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇదిలా వుంటే పూజా హెగ్డే కు మరో పిరియాడిక్ లవ్స్టోరీ లో నటించే ఆఫర్ లభించింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి ఓ పిరియాడిక్ లవ్స్టోరీని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. `యుద్ధంతో రాసిన ప్రేమకథ` అది ఈ మూవీ క్యాప్షన్. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ చిత్రాన్ని లెఫ్టిఎంట్ రామ్ అనే ఓ యుద్ధ సైనికుడి కోణంలో పిరియాడిక్ లవ్స్టోరీగా ప్రొడ్యూసర్ స్వప్నాదత్ నిర్మించబోతున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ని దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ మూవీ కోసం ఇద్దరు హీరోయిన్లని అనుకుంటున్నారు. అందులో మెయిన్ హీరోయిన్గా పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్టు తెలిసింది. అయితే ఈ మూవీ కి 2.5 కోట్లు పారితోషికాన్ని పూజా డిమాండ్ చేసిందట. స్వప్నాదత్ మాత్రం అంత ఇవ్వలేమని కొంత తగ్గించుకోమని పూజాని రిక్వెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. మరో మరోయిన్గా రష్మిక మందన్నని అనుకుంటున్నారట. ఇందుకు రష్మిక అంగీకరిస్తుందా అన్నది కష్టమే అంటున్నారు. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ని జనవరి నుంచి ప్రారంభించనున్నట్టు తాజా న్యూస్.