దక్షిణాదిలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం.. పేరొచ్చాక దక్షిణాదిపై బురదజల్లడం నార్త్ హీరోయిన్లకు ఈ మధ్య ఫ్యాషన్గా మారింది. గతంలో ఇదే తరహాలో దక్షిణాది ఫిల్మ్ మేకర్స్పై రాధికా ఆప్టే, తాప్సీ విమర్శలు గుప్పించి ట్రోల్కి గురైన విషయం తెలిసిందే. తాజాగా పూజా హెగ్డే అదే తరహా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టిస్తోంది. తాజాగా సౌత్ ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
సౌత్ ఇండియా వాళ్లంతా నడుము చుట్టే తిరుగుతారని దుమారం సృష్టించింది. తమిళ సినిమాతో కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే ఆ తరువాత తెలుగు సినిమాలతో స్టార్డమ్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం రెండు కోట్లు డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే తెలుగులో ప్రస్తుతం టాప్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకుంది. సౌత్ ఇండియా వాళ్లు నడము మత్తులో తూగిపోతారని పూజా చేసిన వ్యాఖ్యలకు నెటిజన్స్ ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు.
సౌత్ ఇండిస్ట్రీలో ఎదిగి ఇక్కడే కోట్లల్లో పారితోషికాలు అందుకుంటున్న పూజా ఇలా ఎదిగిన ఇండస్ట్రీనే టార్గెట్ చేయడం ఏమీ బాగాలేదని నెటిజన్స్ పూజాపై మండి పడుతున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో `రాధేశ్యామ్`, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటిస్తోంది.