Homeటాప్ స్టోరీస్బుట్ట బొమ్మ కూడా ఇట‌లీకి చెక్కేసింది

బుట్ట బొమ్మ కూడా ఇట‌లీకి చెక్కేసింది

బుట్ట బొమ్మ కూడా ఇట‌లీకి చెక్కేసింది
బుట్ట బొమ్మ కూడా ఇట‌లీకి చెక్కేసింది

గ‌డిచిన ఏడు నెల‌లుగా ఎలాంటి షూటింగ్‌లు జ‌ర‌గ‌లేదు. తాజాగా అన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా ఒక్కో మూవీ రీ స్టార్ట్ అవుతున్నాయి. దీంతో సినీ ఇండ‌స్ట్రీలో సంద‌డి మొద‌లైంది. ఈ నెల 15 నుంచి థియేట‌ర్లు కూడా ఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని కేంద్రం కొత్త‌గా మార్గ ద‌ర్శ‌కాల‌ని రిలీజ్ చేయ‌డంతో మ‌రింత సంద‌డి మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో విదేశాల్లో షూటింగ్‌లు మొద‌ల‌య్యాయి. ఇండియా నుంచి విదేశాల్లో బాలీవుడ్ చిత్రాల షూటింగ్ మొద‌లైంది.

తాజాగా తెలుగు నుంచి లాక్‌డౌన్ త‌రువాత షూటింగ్ చేస్తున్న మొట్ట‌మొద‌టి తెలుగు చిత్రంగా `రాధేశ్యామ్‌` నిలిచింది. ప్ర‌భాస్ హీరోగా యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు ఈ మూవీ షూటింగ్ ఇటలీలో పాటు జార్జీయాలో జ‌రిగింది. అయితే క‌రోనా ఉదృతి పెర‌గ‌డంతో చిత్ర బృందం కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేయ‌కుండానే ఇండియాకు తిరిగి వ‌చ్చింది.

- Advertisement -

ఇటీవ‌ల ఈ షెడ్యూల్‌ని పూర్తి చేయ‌డం కోసం ప్ర‌భాస్‌తో పాటు టీమ్ అంతా మ‌ళ్లీ ఇటలీ వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో పాల్గొన‌డానికి తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఇట‌లీ వెళ్లిన‌ట్టు తెలిసింది. అక్క‌డ షూటింగ్ పూర్తి కాగానే బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని హైద‌రాబాద్‌లో పూర్తి చేస్తార‌ట‌. ఈ పిరియాడిక్ ల‌వ్‌స్టోరీని వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All