గడిచిన ఏడు నెలలుగా ఎలాంటి షూటింగ్లు జరగలేదు. తాజాగా అన్లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కో మూవీ రీ స్టార్ట్ అవుతున్నాయి. దీంతో సినీ ఇండస్ట్రీలో సందడి మొదలైంది. ఈ నెల 15 నుంచి థియేటర్లు కూడా ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం కొత్తగా మార్గ దర్శకాలని రిలీజ్ చేయడంతో మరింత సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్లు మొదలయ్యాయి. ఇండియా నుంచి విదేశాల్లో బాలీవుడ్ చిత్రాల షూటింగ్ మొదలైంది.
తాజాగా తెలుగు నుంచి లాక్డౌన్ తరువాత షూటింగ్ చేస్తున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా `రాధేశ్యామ్` నిలిచింది. ప్రభాస్ హీరోగా యువీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్డౌన్కి ముందు ఈ మూవీ షూటింగ్ ఇటలీలో పాటు జార్జీయాలో జరిగింది. అయితే కరోనా ఉదృతి పెరగడంతో చిత్ర బృందం కీలక ఘట్టాలని పూర్తి చేయకుండానే ఇండియాకు తిరిగి వచ్చింది.
ఇటీవల ఈ షెడ్యూల్ని పూర్తి చేయడం కోసం ప్రభాస్తో పాటు టీమ్ అంతా మళ్లీ ఇటలీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్లో పాల్గొనడానికి తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఇటలీ వెళ్లినట్టు తెలిసింది. అక్కడ షూటింగ్ పూర్తి కాగానే బ్యాలెన్స్గా వున్న షూటింగ్ని హైదరాబాద్లో పూర్తి చేస్తారట. ఈ పిరియాడిక్ లవ్స్టోరీని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.