గత ఏడాది ప్రారంభంలో `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే . ఈ మూవీ తరువాత ఈ ఏడాది వరస క్రేజీ ప్రాజెక్ట్లలో నటిస్తోంది. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `రాధేశ్యామ్`తో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రంలో మెగా పవర్స్టార్కు జోడీగా కనిపించబోతోంది.
ఇదిలా వుంటే ఈ బుట్టబొమ్మకి `అల వైకుంఠపురములో` టీమ్ నుంచి ఓ స్పెషల్ గిఫ్ట్ ని హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రత్యేకంగా పంపించారట మేకర్స్. ఆ గిఫ్ట్ ఓ సైకిల్. `అల వైకుంఠపురములో` చిత్రంలోని `బుట్టబొమ్మ .. సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఈ పాటలో వాడిన సైకిల్నే పూజా హెగ్డేకి చిత్ర బృందం బహుమతిగా అందజేసింది.
అ ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. `బుట్ట బొమ్మ పాటలో
వాడిన సైకిల్కి నేను ఫిదా అయిపోయాను. అది నాకెంతో నచ్చింది. మొదటిసారి షూట్లో దాన్ని చూడగానే చక్కగా అలంకరించారు అనిపించింది. దానిపై నేను మనసు పారేసుకున్నానని తెలుసుకున్న మేకర్స్ నా కోసం ప్రత్యేకంగా దాన్ని హైదరాబాద్ నుంచి ముంబై పంపించారు. ప్రస్తుతం ఆ సైకిల్ ని మా నివాసంలో భద్రంగా దాచాను. ఆ సినిమా నుంచి నాకు లభించిన మధురమైన జ్ఞాపకమది` అని పూజా హెగ్డే తెలిపారు.