దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం `పెళ్లి సందడి`. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. దీప్తి భట్నాగర్, రవళి హీరోయిన్లుగా శ్రీరాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్స్ సి. అశ్వనీదత్, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 1996 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఎం.ఎం. కీరవాణి మ్యాజిక్తో మ్యూజికల్ ఎంటర్టైనర్గా భారీ విజయాన్ని సాధించింది.
ఈ మూవీకి సీక్వెల్గా ప్రస్తుతం `పెళ్లిసందD` పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా పరిచయం అవుతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌరీ రోనన్కి దర్శకత్వం వహిస్తున్నారు. స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సమర్పణలో ఆర్కే మీడియా అసోసియేట్స్ బ్యానర్పై మాధవీ కోవెల మూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
ఈ విషయాన్ని మంగళవారం కె. రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
`పెళ్లిసందడి. నేటికి సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణి కి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను. ఈ పాతికేళ్ల `పెళ్లిసందడి` సంబరాలను రెట్టింపు చేయడానికి `పెళ్లిసందD` సినిమా ని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల తో చేస్తున్నాము. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం… త్వరలో థియేటర్లో కలుద్దాం` అంటూ ఓ వీడియోని షేర్ చేశారు.
ఈ పాతికేళ్ల #పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి #పెళ్లిసందD సినిమా ని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల తో చేస్తున్నాము.. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం… త్వరలో థియేటర్లో కలుద్దాం. pic.twitter.com/nplvTCHrk8
— Raghavendra Rao K (@Ragavendraraoba) January 12, 2021