యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స 2 బ్యానర్పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథనాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే అఖిల్ మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ని కోట్ చేసినట్టు తెలిసింది.
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే బడ్జెట్ ఈ చిత్రానికి ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ మూవీకి సురేందర్రెడ్డి కోట్ చేసిన బడ్జెట్ 45 కోట్లు. ఈ బడ్జెట్ లో అఖిల్తో సినిమా అంటే వర్కవుట్ అయ్యే పని కాదు. ఇంత బడ్జెట్ ఎందుకంటే ఈ కథని ముందు పవన్ కోసం రెడీ చేశారట. అయితే విదేశాల్లో షూటింగ్ అత్యధికంగా వుండటంతో యంగ్ హీరోని ఈ కథకు ఎంచుకోమబని పవన్ చెప్పారట.
దీంతో పవన్ కోసం మరో కథని సిద్ధం చేస్తున్నారట సురేందర్రెడ్డి. స్పై థ్రిల్లర్ కథ కావడంతో అఖిల్ ఈ స్క్రిప్ట్పై మనసు పడ్డారని, ఆయితే బడ్జెట్ వర్కవుట్ అయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు. అయినా సురేందర్రెడ్డి మాత్రం ఈ చిత్రాన్ని నిర్మించే నిర్మాత కోసం అన్వేషణ మొదలుపెట్టారట.